నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ గ్రామంలో నిర్వహించిన పలు శుభకార్యాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. చెట్టుకింది అంజన్న నూతన గృహప్రవేశం, కుటుంబ సభ్యుల నూతన వస్త్రధారణ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపి చిన్నారులను ఆశీర్వదించారు.అనంతరం మల్కన్నోల కిష్టయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ప్రజల సంతోషాల్లో, శుభకార్యాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో బోజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, దిగంబర్ రెడ్డి సర్పంచ్, వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డి,అఖిలేష్ రెడ్డి,పుట్టి నర్సింలు,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్యే
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ గ్రామంలో నిర్వహించిన పలు శుభకార్యాల్లో ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు. చెట్టుకింది అంజన్న నూతన గృహప్రవేశం, కుటుంబ సభ్యుల నూతన వస్త్రధారణ కార్యక్రమాల్లో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపి చిన్నారులను ఆశీర్వదించారు.అనంతరం మల్కన్నోల కిష్టయ్య ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ఇళ్ల పథకం లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ప్రజల సంతోషాల్లో, శుభకార్యాల్లో భాగస్వామ్యం కావడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో బోజిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, దిగంబర్ రెడ్డి సర్పంచ్, వెంకట్ రెడ్డి, నవీన్ రెడ్డి,అఖిలేష్ రెడ్డి,పుట్టి నర్సింలు,స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి