Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 09:58 PM

పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి
29-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని మీసేవ కేంద్రం నిర్వాహకుడిని నమ్మించి రూ.30 వేలు మోసం చేసిన ఘటన కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి గ్రామానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడికి గత జూన్‌ 2న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను కంగ్టి పోలీస్‌స్టేషన్‌ నుంచి మాట్లాడుతున్నానని, తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తన వద్ద నగదు ఉందని, యూపీఐ ద్వారా డబ్బులు పంపితే నగదు ఇస్తానని నమ్మించడంతో నిర్వాహకుడు రూ.30 వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అనంతరం ఫోన్‌ చేయగా ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీశాడు. దీంతో తాను సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని, ఆర్మీ అధికారులమని లేదా ఇతర అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Sthanikam

పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి

Article Image

పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని మీసేవ కేంద్రం నిర్వాహకుడిని నమ్మించి రూ.30 వేలు మోసం చేసిన ఘటన కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి గ్రామానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడికి గత జూన్‌ 2న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి తాను కంగ్టి పోలీస్‌స్టేషన్‌ నుంచి మాట్లాడుతున్నానని, తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తన వద్ద నగదు ఉందని, యూపీఐ ద్వారా డబ్బులు పంపితే నగదు ఇస్తానని నమ్మించడంతో నిర్వాహకుడు రూ.30 వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అనంతరం ఫోన్‌ చేయగా ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆరా తీశాడు. దీంతో తాను సైబర్‌ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని, ఆర్మీ అధికారులమని లేదా ఇతర అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News