పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని మీసేవ కేంద్రం నిర్వాహకుడిని నమ్మించి రూ.30 వేలు మోసం చేసిన ఘటన కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి గ్రామానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడికి గత జూన్ 2న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను కంగ్టి పోలీస్స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని, తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తన వద్ద నగదు ఉందని, యూపీఐ ద్వారా డబ్బులు పంపితే నగదు ఇస్తానని నమ్మించడంతో నిర్వాహకుడు రూ.30 వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అనంతరం ఫోన్ చేయగా ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్స్టేషన్కు వెళ్లి ఆరా తీశాడు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని, ఆర్మీ అధికారులమని లేదా ఇతర అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి
పోలీసులమంటూ మోసం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కంగ్టి సిఐ వెంకట్ రెడ్డి
Krishna
పోలీసు అధికారిగా పరిచయం చేసుకుని మీసేవ కేంద్రం నిర్వాహకుడిని నమ్మించి రూ.30 వేలు మోసం చేసిన ఘటన కంగ్టి మండలంలో చోటుచేసుకుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కంగ్టి గ్రామానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడికి గత జూన్ 2న గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి తాను కంగ్టి పోలీస్స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానని, తన కుమార్తెకు ప్రమాదం జరిగిందని చెప్పాడు. తన వద్ద నగదు ఉందని, యూపీఐ ద్వారా డబ్బులు పంపితే నగదు ఇస్తానని నమ్మించడంతో నిర్వాహకుడు రూ.30 వేలు యూపీఐ ద్వారా బదిలీ చేశాడు. అనంతరం ఫోన్ చేయగా ఆ వ్యక్తి స్పందించకపోవడంతో అనుమానం వచ్చి పోలీస్స్టేషన్కు వెళ్లి ఆరా తీశాడు. దీంతో తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి వెంటనే 1930కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కంగ్టి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు పోలీసులమని, ఆర్మీ అధికారులమని లేదా ఇతర అధికారులమని చెప్పి డబ్బులు అడిగితే నమ్మవద్దని ప్రజలను హెచ్చరించారు. ఎవరైనా అనుమానాస్పదంగా డబ్బులు అడిగితే వెంటనే పోలీసులను సంప్రదించాలని, సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి