Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అన్నకు రాఖీ కట్టేందుకు వచ్చి.. కుమారుడిని కోల్పోయిన తల్లి! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 03:29 PM

తెలుగు మాధుర్యం మరువొద్దు. ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం

తెలుగు మాధుర్యం మరువొద్దు. ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం

తెలుగు మాధుర్యం మరువొద్దు. ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం
29-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మాతృభాష తెలుగు పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని భాషల్లో తెలుగు ఎంతో మధురమైనదని, పలువురు భాషావేత్తలు తెలుగు గొప్పతనాన్ని చాటిచెప్పారని అన్నారు. మాతృభాషను నిరాదరించకూడదని సూచించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ.. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలో రచనలు చేయాలని గిడుగు రామ్మూర్తి పంతులు ఉద్యమించారని తెలిపారు. తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌.రత్నమంజుల, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మీనీలిమ, తెలుగు శాఖ అధ్యాపకులు అద్దంకి ఆంజనేయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

తెలుగు మాధుర్యం మరువొద్దు. ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం

Article Image

మాతృభాష తెలుగు పట్ల ప్రతి ఒక్కరూ గౌరవం కలిగి ఉండాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులు ఆచార్య రాహత్‌ ఖానం అన్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని భాషల్లో తెలుగు ఎంతో మధురమైనదని, పలువురు భాషావేత్తలు తెలుగు గొప్పతనాన్ని చాటిచెప్పారని అన్నారు. మాతృభాషను నిరాదరించకూడదని సూచించారు. తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్‌ తండు కృష్ణ కౌండిన్య మాట్లాడుతూ.. సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా వ్యవహారిక భాషలో రచనలు చేయాలని గిడుగు రామ్మూర్తి పంతులు ఉద్యమించారని తెలిపారు. తెలుగు భాష కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య ఆర్‌.రత్నమంజుల, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ లక్ష్మీనీలిమ, తెలుగు శాఖ అధ్యాపకులు అద్దంకి ఆంజనేయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News