ఐక్యతతో పండుగలు నిర్వహిద్దాం: సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య
రామన్నపేట: నిదానపల్లి గ్రామంలో నిర్వహించనున్న ముత్యాలమ్మ తల్లి, కట్ట మైసమ్మ తల్లి, బొడ్రాయి పండుగల ఏర్పాట్లు, నిర్వహణపై చర్చించేందుకు ఆదివారం ఉదయం 9.30 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం నిర్వహించనున్నట్లు గ్రామ సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య తెలిపారు.
సమావేశానికి కుల సంఘాల నాయకులు, గ్రామ పెద్దలు, వార్డు సభ్యులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజల ప్రతినిధులు హాజరుకావాలని ఆమె కోరారు. అందరి అభిప్రాయాలను తీసుకుని సమష్టిగా ప్రణాళిక రూపొందించి పండుగలను ఘనంగా నిర్వహించేందుకు సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరై సహకరించాలని సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య, గ్రామపంచాయతీ పాలకవర్గం కోరింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి