నకిరేకల్: అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు, ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యకు నకిరేకల్ తాజా మాజీ జడ్పీటీసీ మాధ ధనలక్ష్మి–నగేష్ గౌడ్ దంపతులు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చిరుమర్తి లింగయ్యకు ఆయురారోగ్యాలు, ఆనందం, శాంతి, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ఆయనకు ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాజకీయంగా మరింత ఉన్నత స్థాయికి ఎదిగి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకున్నారు.
రాఖీ పౌర్ణమి పర్వదినం అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, అనుబంధం, ఆత్మీయతను మరింత బలోపేతం చేసే పవిత్రమైన సందర్భమని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి నోముల కేశవరాజు, మాజీ ఎంపీటీసీ గుర్రం గణేష్, మండల యువజన అధ్యక్షులు పేర్ల కృష్ణకాంత్ తదితరులు పాల్గొని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి