Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:33 AM

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల సీజ్

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల సీజ్

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల సీజ్
28-08-2026 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

141 టన్నుల ఇసుక స్వాధీనం, ఇద్దరు డ్రైవర్లపై కేసు

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్కాపురం గ్రామం పరిధిలో పోలీసులు, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఆ సమయంలో ఏపీ వైపు నుంచి వస్తున్న రెండు లారీలను ఆపి పరిశీలించగా, ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ​AP 39WC 6179 లారీలో 69.77 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్న డ్రైవర్ ఎస్.కె. బాబావలిని అదుపులోకి తీసుకున్నారు.AP 37UG 3889 లారీలో 71.49 టన్నుల ఇసుకను తరలిస్తున్న డ్రైవర్ జానీ భాషను పట్టుకున్నారు.మొత్తం 141.26 టన్నుల ఇసుకతో పాటు రెండు లారీలను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కే.రాఘవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Sthanikam

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు లారీల సీజ్

Article Image

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు

141 టన్నుల ఇసుక స్వాధీనం, ఇద్దరు డ్రైవర్లపై కేసు

ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్‌కి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.మన్మధ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఉదయం 8 గంటల ప్రాంతంలో మల్కాపురం గ్రామం పరిధిలో పోలీసులు, గనుల శాఖ అధికారులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఆ సమయంలో ఏపీ వైపు నుంచి వస్తున్న రెండు లారీలను ఆపి పరిశీలించగా, ఎలాంటి ఆధారాలు, అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ​AP 39WC 6179 లారీలో 69.77 టన్నుల ఇసుకను రవాణా చేస్తున్న డ్రైవర్ ఎస్.కె. బాబావలిని అదుపులోకి తీసుకున్నారు.AP 37UG 3889 లారీలో 71.49 టన్నుల ఇసుకను తరలిస్తున్న డ్రైవర్ జానీ భాషను పట్టుకున్నారు.మొత్తం 141.26 టన్నుల ఇసుకతో పాటు రెండు లారీలను సీజ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ కే.రాఘవరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News