వనస్థలిపురం
మహిళల భద్రతకు పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని వనస్థలిపురం సీఐ రవి బాబు అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ బి. సుమతి, ఐపీఎస్ ఆదేశాల మేరకు గురువారం సహచరి కార్యక్రమంలో భాగంగా రక్షాబంధన్ నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు సీఐ రవి బాబుకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు ఏ సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సీఐ సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు నాగరాజు, మల్లయ్య, గిరిష్, గౌతమ్, అనిల్, ఇతర పోలీస్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి