సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గంధం రాము ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.గురువారం మునగాల మండలం ముకుందాపురం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 45 మంది వృద్ధులకు ఈ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు మాట్లాడుతూ అధ్యాపకులు గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టు వృత్తి లో ఎన్నో వడిదుకులు ఎదుర్కొని యువత వృదయాల్లో నిలిచిన కారంగుల అంజన్న గౌడ్ యువతకు ఆదర్శమన్నారు. 35 సంవత్సరాలుగా విలేకరి వృత్తి లో అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘనత ఆయనదన్నారు. ప్రస్తుతం విలేకరి వృత్తిని ఎంచుకునే యువత అంజన్ గౌడ్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు గాంధీ, సురేష్, కుడుముల సైదులు, గోపాల్, వాసు, సంపత్, శ్రీకాంత్, నజీర్, మహేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు
వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు
Harish reporter
సీనియర్ జర్నలిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కారింగుల అంజన్న గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకొని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు గంధం రాము ఆధ్వర్యంలో అనాధ వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.గురువారం మునగాల మండలం ముకుందాపురం లోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో 45 మంది వృద్ధులకు ఈ పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సభ్యులు మాట్లాడుతూ అధ్యాపకులు గా జీవితాన్ని ప్రారంభించి జర్నలిస్టు వృత్తి లో ఎన్నో వడిదుకులు ఎదుర్కొని యువత వృదయాల్లో నిలిచిన కారంగుల అంజన్న గౌడ్ యువతకు ఆదర్శమన్నారు. 35 సంవత్సరాలుగా విలేకరి వృత్తి లో అనేక సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించిన ఘనత ఆయనదన్నారు. ప్రస్తుతం విలేకరి వృత్తిని ఎంచుకునే యువత అంజన్ గౌడ్ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు గాంధీ, సురేష్, కుడుముల సైదులు, గోపాల్, వాసు, సంపత్, శ్రీకాంత్, నజీర్, మహేష్, ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి