రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ – అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలను అత్యంత అభిమానంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక, రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ... రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. మా చెల్లెలు మౌనిక నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ... అన్నా వదినల ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
పబ్బు రాజు గౌడ్కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక
పబ్బు రాజు గౌడ్కు రాఖీ కట్టిన సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి మౌనిక
K.RAVI
రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఇంచార్జి పబ్బు రాజు గౌడ్ – అరుణ దంపతుల నివాసంలో రాఖీ వేడుకలను అత్యంత అభిమానంతో నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక, రాజు గౌడ్ దంపతులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పబ్బు రాజు గౌడ్ దంపతులు మాట్లాడుతూ... రాఖీ పండుగ అనేది సోదరభావానికి, ఆప్యాయతలకు నిదర్శనమని పేర్కొన్నారు. మా చెల్లెలు మౌనిక నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అనంతరం మౌనిక మాట్లాడుతూ... అన్నా వదినల ఆశీస్సులు, ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి