ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకుల అందజేత
నారాయణఖేడ్ మండలం పోతన్పల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన, జీఎంఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుందేళ్ల లక్ష్మమ్మ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలిచి, వారికి అవసరమైన సమయంలో చేయూత అందించడమే లక్ష్యంగా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సాయి రెడ్డి, సిద్దు ముదిరాజ్, వార్డు సభ్యులు సాయిలు, గొల్ల తుకారం, కుమ్మరి తుకారం, మంగలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి