తెలంగాణ క్రీడారంగానికి మరో అరుదైన గుర్తింపు లభించింది. ఒలింపిక్స్లో అధికారిక క్రీడగా గుర్తింపు పొందిన లాక్రోస్ సౌత్-ఈస్ట్ ఏషియన్ కప్ ఛాంపియన్షిప్–2026కు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు ఎంపికయ్యారు.
ఆగస్టు 28, 29, 30 తేదీల్లో మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగే పోటీల్లో వీరు భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
ఎంపికైన వారిలో ఆకాష్, కరంతూత్, చిర్రబోయిన సంగీత యాదవ్, గోపిక ఉన్నారు. నల్గొండకు చెందిన గోపికతో పాటు ఎంపికైన క్రీడాకారులు ఫిజికల్ డైరెక్టర్ అంజలి యాదవ్, తెలంగాణ లాక్రోస్ ప్రధాన కోచ్ ఎ. శివకుమార్ పర్యవేక్షణలో శిక్షణ పొందారు.
అసోసియేషన్ అభినందనలు
తెలంగాణ లాక్రోస్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.డి. లతీఫుద్దీన్, ప్రధాన కార్యదర్శి కె. భానుచందర్ ఎంపికైన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు, కోచ్లను అభినందించారు.
మలేషియాలో జరిగే పోటీల్లో ప్రతిభ కనబరిచి దేశానికి, రాష్ట్రానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కొత్త క్రీడాకారులు, కోచ్లను ప్రోత్సహిస్తూ అవసరమైన సహకారం అందించేందుకు అసోసియేషన్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. కె. భానుచందర్ నేతృత్వంలో ఇప్పటికే పలువురు క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో లాక్రోస్లో రాణించడం విశేషం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి