Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గొర్రెల దొంగతనం కేసును ఛేదించిన రామగిరి పోలీసులు.. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:23 PM

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి; సర్పంచ్ కలకోట్ల మల్లేష్
26-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడంతో పాటు పశువుల నుంచి రక్షణ కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, రహదారుల వెంట, చెరువుల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, పాలకవర్గ సభ్యులు, పంచాయతి కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి; సర్పంచ్ కలకోట్ల మల్లేష్

Article Image

తుంగతుర్తి;

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడంతో పాటు పశువుల నుంచి రక్షణ కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, రహదారుల వెంట, చెరువుల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, పాలకవర్గ సభ్యులు, పంచాయతి కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News