తుంగతుర్తి;
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సర్పంచ్ కలకోట్ల మల్లేష్ అన్నారు. మండల పరిధిలోని సంగెం గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి నీరు పోశారు. మొక్కలు నాటడంతోనే బాధ్యత పూర్తికాదని, వాటిని సంరక్షించి పెద్ద చెట్లుగా ఎదిగేలా చూడటమే అసలైన లక్ష్యమన్నారు. నాటిన మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించడంతో పాటు పశువుల నుంచి రక్షణ కల్పించాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల్లోని ఖాళీ ప్రదేశాలు, పాఠశాలలు, రహదారుల వెంట, చెరువుల పరిసరాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.ప్రతి ఇంట్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీలత, పాలకవర్గ సభ్యులు, పంచాయతి కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి