ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మరో 3 లక్షల మందికి కొత్తగా సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ నుంచి కొత్త పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు.
మొదటి ప్రాధాన్యతగా వితంతువులు, వృద్ధులకు పింఛన్లు అందించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో సుమారు 1.70 లక్షల మంది వితంతువులు గుర్తించగా.. పరిశీలన అనంతరం సుమారు 1.50 లక్షల మంది అర్హులుగా ప్రాథమికంగా తేలారు.
మిగిలిన 1.50 లక్షల పింఛన్లను వృద్ధులకు ఇవ్వనున్నారు. గత ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్నప్పటికీ పింఛను పొందని వారు దాదాపు లక్ష మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
అదే విధంగా చర్మకారులు, దప్పు కళాకారులు, చేనేత, గీత కార్మికులు వంటి వృత్తిపరమైన వర్గాల వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ కేటగిరీల్లో 60 నుంచి 70 వేల మంది వరకు ఉండొచ్చని అంచనా.
దివ్యాంగుల పింఛన్ల విషయంలో అర్హత లేని వారికి కూడా ధ్రువీకరణ పత్రాలు జారీ అయినట్లు గుర్తించడంతో అధికారులు దీనిపైనా పరిశీలన చేస్తున్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి