వట్టిమర్తి రెవెన్యూ పరిధిలో ఘటన.. మృతుడి వయసు 40–45 ఏళ్లు.
చిట్యాల మండలం వట్టిమర్తి రెవెన్యూ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి ఉరివేసుకుని మృతిచెందిన ఘటన మంగళవారం వెలుగుచూసింది. MPL కంపెనీ సమీపంలోని రైల్వే ట్రాక్ వద్ద వేప చెట్టుకు ఓ వ్యక్తి ఉరివేసుకుని ఉండటాన్ని గొర్రెల కాపరులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉన్నట్లు పేర్కొన్నారు.
మృతుడి ఒంటిపై గోధుమ రంగు ఫుల్హ్యాండ్ షర్టు, సిమెంట్ రంగు ప్యాంటు ఉన్నాయి. ఎలాంటి గుర్తింపు కార్డులు, ఆధారాలు లభించకపోవడంతో మృతుడి వివరాలు తెలియరాలేదు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుడిని ఎవరైనా గుర్తించినా, ఆయనకు సంబంధించిన వివరాలు తెలిసినా వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
సమాచారం కోసం:
చిట్యాల ఎస్ఐ: 8712670187
నార్కట్పల్లి సీఐ: 8712670148
చిట్యాల పోలీస్ స్టేషన్: 8712667731

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి