అంగన్వాడీ, పీహెచ్సీ, ప్రభుత్వ కార్యాలయాల వద్ద మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనమహోత్సవం–2026లో భాగంగా న్యాల్కల్ మండల కేంద్రంలో మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రం, పీహెచ్సీ, ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో మొక్కలు నాటారు. పచ్చదనం పెంపొందించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ వైశాలి, పీహెచ్ఓ సుదర్శన్, గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి–ప్రవీణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ పద్మతో పాటు
న్యాల్కల్లో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు
గ్రామస్తులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించి, వాటిని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాల పరిసరాల్లో పచ్చదనం పెంచడం ద్వారా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. వనమహోత్సవాన్ని కేవలం మొక్కలు నాటే కార్యక్రమంగా కాకుండా వాటి సంరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా కొనసాగించాలని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి