బోగారం: గ్రామంలో త్వరలో జరగనున్న ఊర బోనాల పండుగ సందర్భంగా ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్గౌడ్ తెలిపారు. సర్పంచ్ ఆధ్వర్యంలో విద్యుత్ స్తంభాలకు అదనపు లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు లైట్లు లేని స్తంభాలకు నూతన లైట్లను అమర్చారు.
ఈ సందర్భంగా సర్పంచ్ సాయికుమార్గౌడ్ విద్యుత్ సిబ్బందితో కలిసి గ్రామంలో లైట్లు అవసరమైన ప్రాంతాలను పరిశీలించి, ఏర్పాటు చేసిన లైట్ల పనులను పర్యవేక్షించారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో 5వ వార్డు సభ్యురాలు నేరేటి మానస సురేష్యాదవ్, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, కందగట్ల శ్రీనివాసులు, కందగట్ల ఆదినారాయణ, చెరుకు సత్తయ్యగౌడ్, నేరేటి రమేష్యాదవ్, జెల్ల వెంకటేశ్వర్లు, కడారి శ్రీనివాసులు, మేడి కృష్ణ, బొడ్డుపల్లి వినోద్కుమార్, సింగం సత్యనారాయణ, బోగారం–సిరిపురం విద్యుత్ లైన్మెన్ కూనూరు మహేష్గౌడ్, గ్రామపంచాయతీ ఎలక్ట్రిషన్ సిబ్బంది బొడ్డుపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి