చిట్యాల, ఆగస్టు 25 (స్థానిక ప్రతినిధి): నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ఉపసర్పంచ్ అంతటి స్వప్న సత్తయ్య గౌడ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ చేశారు. గ్రామంలో పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని ఉపసర్పంచ్ సూచించారు.
కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు మహంకాళి లింగస్వామి, దేశబోయిన మంజుల మల్లేష్యాదవ్, చింతకింది వెంకటేశం, వరికుప్పల సంగీత సుధాకర్, గ్రామ కార్యదర్శి తాటికొండ లింగస్వామి, ఉపాధిహామీ కూలీలు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి