Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 06:53 PM

ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు

ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు

ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు
16-08-2026 77 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


ఐదుగురు అరెస్ట్‌.. ఐదు వాహనాలు స్వాధీనం.


చిట్యాల: పారిశ్రామిక రసాయనాలను తరలిస్తున్న ట్యాంకర్ల నుంచి అక్రమంగా దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వచేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు. వెలిమినేడు శివారులోని రాజస్థాన్‌ ధాబా సమీపంలో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కెమికల్‌ ట్యాంకర్లు, మూడు ఇతర వాహనాలు, రసాయనాలతో కూడిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు, పైపులు, రవాణా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాంకర్‌ డ్రైవర్లతో కుమ్మక్కై రసాయనాలను తక్కువ ధరకు సేకరించి, ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌తో పాటు ఇద్దరు ట్యాంకర్‌ డ్రైవర్లు, ఇద్దరు కూలీలు ఉన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వ్యవహారం వెనుక మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Sthanikam

ట్యాంకర్ల నుంచి రసాయనాల దారి మళ్లింపు

Article Image


ఐదుగురు అరెస్ట్‌.. ఐదు వాహనాలు స్వాధీనం.


చిట్యాల: పారిశ్రామిక రసాయనాలను తరలిస్తున్న ట్యాంకర్ల నుంచి అక్రమంగా దారి మళ్లించి, డ్రమ్ముల్లో నిల్వచేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును చిట్యాల పోలీసులు రట్టు చేశారు. వెలిమినేడు శివారులోని రాజస్థాన్‌ ధాబా సమీపంలో ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రెండు కెమికల్‌ ట్యాంకర్లు, మూడు ఇతర వాహనాలు, రసాయనాలతో కూడిన ప్లాస్టిక్‌ డ్రమ్ములు, పైపులు, రవాణా పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ట్యాంకర్‌ డ్రైవర్లతో కుమ్మక్కై రసాయనాలను తక్కువ ధరకు సేకరించి, ఇతర ప్రాంతాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు సత్యనారాయణ అలియాస్‌ సతీష్‌తో పాటు ఇద్దరు ట్యాంకర్‌ డ్రైవర్లు, ఇద్దరు కూలీలు ఉన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. వ్యవహారం వెనుక మరికొందరి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News