నాగోల్: దేశభక్తి భావాన్ని చాటుతూ నాగోల్ పోలీస్ స్టేషన్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్హెచ్ఓ మహమ్మద్ మక్బూల్ జానీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎస్ఐలు శివ, నాగప్రసాద్, రమేష్, దశరథ్, సూర్యనాయక్, ఉమా, మమత, ఏఎస్ఐ జంగయ్యతో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు అనంతుల రాజారెడ్డి, సీతారాములుపల్లె, బి. దనంజయ్ గౌడ్, ఈంద్రాల రమేష్ గౌడ్, బి. కుమార్ గౌడ్, చెరుకు ప్రవీణ్ గౌడ్, మధు, సాయి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి