చిట్యాల, ఆగస్టు 15:
చదువుకున్న పాఠశాలను మరువకుండా పూర్వ విద్యార్థులు సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల MPUPS పాఠశాలలో 1994–95 నుంచి 1999–2000 విద్యా సంవత్సరాల మధ్య ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ నలుగురు మిత్రుల జ్ఞాపకార్థం సుమారు రూ.50 వేల విలువైన స్టేజీని నిర్మించి పాఠశాలకు విరాళంగా అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఈ స్టేజీని ప్రారంభించారు.
అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతుల కోసం మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ రూ.5 వేల, మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీపతి రూ.3 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులతో పాటు, బహుమతులకు ఆర్థిక సహాయం అందించిన దాతలను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పలువురు కొనియాడారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉపసర్పంచ్ సునీత బుచ్చిరాములు, ప్రధానోపాధ్యాయులు ఏలుకరాజు ఆంజనేయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నక్కా స్వప్న చంద్రశేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, కిరణ్ కుమార్, కాటమయ్య, లింగారెడ్డి, మౌనిక, శివాని, గ్రామ పెద్దలు, ప్రజలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి