Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:48 PM

పూర్వ విద్యార్థుల సేవాభావం.. పాఠశాలకు రూ.50 వేల స్టేజీ విరాళం

పూర్వ విద్యార్థుల సేవాభావం.. పాఠశాలకు రూ.50 వేల స్టేజీ విరాళం

పూర్వ విద్యార్థుల సేవాభావం.. పాఠశాలకు రూ.50 వేల స్టేజీ విరాళం
15-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల, ఆగస్టు 15:

చదువుకున్న పాఠశాలను మరువకుండా పూర్వ విద్యార్థులు సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల MPUPS పాఠశాలలో 1994–95 నుంచి 1999–2000 విద్యా సంవత్సరాల మధ్య ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ నలుగురు మిత్రుల జ్ఞాపకార్థం సుమారు రూ.50 వేల విలువైన స్టేజీని నిర్మించి పాఠశాలకు విరాళంగా అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఈ స్టేజీని ప్రారంభించారు.

అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతుల కోసం మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ రూ.5 వేల, మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీపతి రూ.3 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులతో పాటు, బహుమతులకు ఆర్థిక సహాయం అందించిన దాతలను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పలువురు కొనియాడారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉపసర్పంచ్ సునీత బుచ్చిరాములు, ప్రధానోపాధ్యాయులు ఏలుకరాజు ఆంజనేయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నక్కా స్వప్న చంద్రశేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, కిరణ్ కుమార్, కాటమయ్య, లింగారెడ్డి, మౌనిక, శివాని, గ్రామ పెద్దలు, ప్రజలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పూర్వ విద్యార్థుల సేవాభావం.. పాఠశాలకు రూ.50 వేల స్టేజీ విరాళం

Article Image

చిట్యాల, ఆగస్టు 15:

చదువుకున్న పాఠశాలను మరువకుండా పూర్వ విద్యార్థులు సేవాభావాన్ని చాటుకున్నారు. చిట్యాల మండలం తాళ్లవెల్లంల MPUPS పాఠశాలలో 1994–95 నుంచి 1999–2000 విద్యా సంవత్సరాల మధ్య ఒకటి నుంచి ఆరో తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ నలుగురు మిత్రుల జ్ఞాపకార్థం సుమారు రూ.50 వేల విలువైన స్టేజీని నిర్మించి పాఠశాలకు విరాళంగా అందజేశారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో ఈ స్టేజీని ప్రారంభించారు.

అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల విద్యార్థులకు వివిధ ఆటల పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బహుమతుల కోసం మాజీ సర్పంచ్ జనగాం రవీందర్ గౌడ్ రూ.5 వేల, మాజీ ఎంపీటీసీ వడ్డేపల్లి లక్ష్మీపతి రూ.3 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ సందర్భంగా పాఠశాల అభివృద్ధికి సహకరించిన పూర్వ విద్యార్థులతో పాటు, బహుమతులకు ఆర్థిక సహాయం అందించిన దాతలను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సహకారం అభినందనీయమని పలువురు కొనియాడారు.

కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్, ఉపసర్పంచ్ సునీత బుచ్చిరాములు, ప్రధానోపాధ్యాయులు ఏలుకరాజు ఆంజనేయులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ నక్కా స్వప్న చంద్రశేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాసులు, కిరణ్ కుమార్, కాటమయ్య, లింగారెడ్డి, మౌనిక, శివాని, గ్రామ పెద్దలు, ప్రజలు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News