నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్ రోడ్డులో, ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రెన్సీ కిచెన్’ రెస్టారెంట్ గ్రాండ్ ఓపెనింగ్ శనివారం ఘనంగా జరిగింది.
నల్లగొండ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్యశ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అతిథులు పాల్గొన్నారు.
రెన్సీ కిచెన్లో అల్పాహారం, భోజనం, రాత్రి భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రెస్టారెంట్ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రెన్సీ కిచెన్ నిర్వాహకులు వీపూరి శ్రీనివాస్, వీపూరి శశికాంత్ మాట్లాడుతూ రెస్టారెంట్కు ప్రజలు, శ్రేయోభిలాషులు ఆదరాభిమానాలు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి గుమ్ముల మోహన్ రెడ్డి, మహ్మద్ అప్రఫ్ అలీ, అబ్బగోని రమేష్ గౌడ్, యా శ్రీ యామ దయాకర్ కవిత, యం.డి. ఇబ్రహీం తదితరులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి