ఈవో ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్ నిరంజన్ గౌడ్
ఈవో ఏజెంట్లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్ నిరంజన్ గౌడ్
K.RAVI
దండు మల్కాపురం మైసమ్మ ఆలయంలో ప్రోటోకాల్ ఉల్లంఘన
మండల పరిధిలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవస్థానం ఈవో వ్యవహార శైలిపై స్థానిక సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతలకు ఏజెంట్లా వ్యవహరిస్తూ ఆలయ ప్రోటోకాల్ను పక్కనబెట్టారని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయంలో జరిగిన బోనాల మహోత్సవాల్లో ప్రోటోకాల్ ప్రకారం స్థానిక సర్పంచ్నైన తనను ఆహ్వానించకపోగా, కనీసం ఆహ్వాన పత్రికలోనూ పేరు వేయకుండా తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న అధికారి పార్టీ నేతల ప్రాపకం కోసం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. గ్రామ ప్రథమ పౌరుడిని విస్మరించి ఇతరులను ముఖ్య అతిథులుగా ఏ ప్రామాణికాలతో పిలిచారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజాస్వామ్య మర్యాదలను కాలరాసిన ఈవో తీరుపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రోటోకాల్ అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి