Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈవో ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారు: సర్పంచ్‌ నిరంజన్‌ గౌడ్‌ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 02, 2026 10:58 PM

ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ చేతుల మీదుగా 78 సీసీటీవీల ప్రారంభం.

ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ చేతుల మీదుగా 78 సీసీటీవీల ప్రారంభం.

ఇన్‌స్పెక్టర్ మక్బూల్ జానీ చేతుల మీదుగా 78 సీసీటీవీల ప్రారంభం.
August 02, 2026 08:48 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నేను సైతం 2.0' కార్యక్రమంలో భద్రతకు మరో ముందడుగు.

హైదరాబాద్, నాగోల్ ఆగస్టు 2 (స్థానికం ప్రతినిధి):

మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న 'నేను సైతం 2.0' కార్యక్రమంలో భాగంగా నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సహభావన అపార్ట్‌మెంట్స్ సి-బ్లాక్‌లో ఏర్పాటు చేసిన 78 సీసీటీవీ కెమెరాలను నాగోల్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ సూర్య పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ, సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీసీటీవీ కెమెరాలు నేరాల నియంత్రణ, దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రజల భాగస్వామ్యంతో సమాజంలో భద్రతను మరింత బలోపేతం చేయవచ్చని పేర్కొన్నారు.

కార్యక్రమంలో సహభావన అపార్ట్‌మెంట్స్ అధ్యక్షుడు చి. శ్రీనివాస్‌రావు, ఉపాధ్యక్షురాలు బి. సంధ్యారాణి, ప్రధాన కార్యదర్శి అబిద్ హుస్సేన్, సలహాదారు జి. అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News