గోరింటాకు వేడుకలతో సంప్రదాయాల పరిరక్షణకు బాట
గోరింటాకు వేడుకలతో సంప్రదాయాల పరిరక్షణకు బాట
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్ల మండల ప్రాథమిక పాఠశాలలో శనివారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మన సంస్కృతి, సంప్రదాయాల ప్రాధాన్యాన్ని తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న మాట్లాడుతూ, నేటి తరం పిల్లలు, యువత భారతీయ ఆచారాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని భావితరాలకు అందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం గౌరీదేవి అనుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీకగా భావిస్తారని తెలిపారు.
అలాగే వర్షాకాలంలో గోరింటాకు శరీరంలోని వేడిని తగ్గించడంతో పాటు ఇన్ఫెక్షన్ల నివారణకు సహజసిద్ధమైన ఔషధంగా ఉపయోగపడుతుందని వివరించారు. విద్యార్థులు సంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలను తెలుసుకుని వాటిని ఆచరించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ పట్ల మౌనిక జనార్దన్, ఉపాధ్యాయులు యాదయ్య, శిరీష, భవాని, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి