కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి
కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి
Editor Desk
రామన్నపేట: కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. పిట్టల శ్రీను రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణ కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ పిట్టల శ్రీను రామన్నపేటలో యువతను సంఘటితం చేసి స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.
పిట్టల శ్రీను కుటుంబానికి సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆయన ఆశయాలే తమకు మార్గదర్శకమని తెలిపారు. పట్టణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత, ప్రజలు ముందుండి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బావళ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, సీనియర్ నాయకులు అముద ఆంజనేయులు, మహిళా సంఘం మండల నాయకురాలు పాల్వంచ లక్ష్మి, పిట్టల పద్మ, పల్లె సత్యం, బావళ్లపల్లి సత్యం, బొల్ల వెంకన్న, రాసాల రమేష్, కడారి రాములు, కుందూరు వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రతాప్, స్నేహ, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి