Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షంతో గోడలు, పైకప్పు కూలిన ఇల్లు.. బాధితులను పరామర్శించిన సర్పంచ్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 01, 2026 06:52 PM

కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి

కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి

కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయ సాధనకు కృషి చేయాలి  రెండో వర్ధంతి సందర్భంగా సీపీఎం నేతల నివాళి
August 01, 2026 04:04 PM 29 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: కామ్రేడ్ పిట్టల శ్రీను ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. పిట్టల శ్రీను రెండో వర్ధంతి సందర్భంగా శనివారం రామన్నపేట పట్టణ కేంద్రంలో సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నివాళి కార్యక్రమం నిర్వహించారు.


ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు కందుల హనుమంతు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్ మాట్లాడుతూ పిట్టల శ్రీను రామన్నపేటలో యువతను సంఘటితం చేసి స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. ఆయన మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు.


పిట్టల శ్రీను కుటుంబానికి సీపీఎం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఆయన ఆశయాలే తమకు మార్గదర్శకమని తెలిపారు. పట్టణ ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత, ప్రజలు ముందుండి పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.


కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బావళ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్, సీనియర్ నాయకులు అముద ఆంజనేయులు, మహిళా సంఘం మండల నాయకురాలు పాల్వంచ లక్ష్మి, పిట్టల పద్మ, పల్లె సత్యం, బావళ్లపల్లి సత్యం, బొల్ల వెంకన్న, రాసాల రమేష్, కడారి రాములు, కుందూరు వెంకటేశ్వర్లు, పాల్వంచ ప్రతాప్, స్నేహ, లింగుస్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News