దివీస్ దాతృత్వంపై విమర్శలా?
దివీస్ దాతృత్వంపై విమర్శలా?
K.RAVI
కంపెనీ అభివృద్ధిని చూడలేని తనం సరికాదు: ఐఎన్టీయూసీ డివిజన్ అధ్యక్షుడు లగ్గొని వెంకటేష్ గౌడ్
గ్రామాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎస్ఆర్ (CSR) నిధులతో ఎన్నో సేవలు అందిస్తున్న దివీస్ లాబొరేటరీస్ కంపెనీపై కొందరు కావాలనే బురద చల్లుతున్నారని ఐఎన్టీయూసీ డివిజన్ అధ్యక్షుడు లగ్గొని వెంకటేష్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. దివీస్ యాజమాన్యం తమ సామాజిక బాధ్యతలో భాగంగా గ్రామా గ్రామాన స్వచ్ఛమైన మంచినీటి ప్లాంట్లు, ప్రభుత్వ కార్యాలయాలకు అవసరమైన వసతులు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోందని కొనియాడారు. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్ విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగులు పంపిణీ చేయడమే కాకుండా, రూ. 19.80 లక్షల వ్యయంతో 7,600 దుప్పట్లను ఉచితంగా అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకుందన్నారు. రైతాంగ సంక్షేమం కోసం కాలువలు తవ్వించి నీటి సదుపాయం మెరుగుపరుస్తున్నారని, ఇది రైతులకు ఎంతగానో మేలు చేస్తుందని పేర్కొన్నారు. దివీస్ అందిస్తున్న సేవలతో పోల్చితే పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర కంపెనీలు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదని వెంకటేష్ గౌడ్ విమర్శించారు. "దివీస్ ఎంతగానో సహాయం చేస్తున్నప్పటికీ విమర్శలు చేయడం తగదు. ఇదే ప్రాంతంలో ఉన్న శ్రీని (Srini) కంపెనీ ప్రజలకు, ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయకపోయినా ఏనాడైనా ఎవరైనా ప్రశ్నించారా?" అని ఆయన నిలదీశారు.
స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడంలో, అభివృద్ధిలో సహకరించని కంపెనీలపై స్థానిక నాయకులు ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. మంచి చేస్తున్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని, అనవసర విమర్శలు మాని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి