Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 07:40 PM

జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.

జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్‌పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
July 31, 2026 04:49 PM 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశం.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. వసతి గృహాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

అనంతరం మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, పెండింగ్ పనులపై ఆరా తీసి, వాటిని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.

తదుపరి రామన్నపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, ఏఈలు ఆశిష్ రాఘవ, సందీప్, సురేష్, పంచాయతీ కార్యదర్శులు సైదిరెడ్డి, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News