జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
జనంపల్లి రెసిడెన్షియల్ స్కూల్పై అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.
Editor Desk
విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలని ఆదేశం.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం జనంపల్లి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, విద్యార్థుల వసతి గృహాలు, వంటశాల, భోజనశాల, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. హాజరు రిజిస్టర్ను పరిశీలించి విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం కల్పించాలని అధికారులకు సూచించారు. వసతి గృహాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యార్థుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన సౌకర్యాలు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, గృహనిర్మాణ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వివిధ శాఖల్లో కొనసాగుతున్న పనుల పురోగతి, పెండింగ్ పనులపై ఆరా తీసి, వాటిని వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
తదుపరి రామన్నపేట ఏరియా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన అదనపు కలెక్టర్, హాజరు రిజిస్టర్ను పరిశీలించి వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాములు, ఏఈలు ఆశిష్ రాఘవ, సందీప్, సురేష్, పంచాయతీ కార్యదర్శులు సైదిరెడ్డి, అయ్యప్పరెడ్డి తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి