Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అడ్డగూడూరులో మరో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 06:20 PM

అడ్డగూడూరులో మరో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం

అడ్డగూడూరులో మరో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం

అడ్డగూడూరులో మరో మైనర్‌పై అత్యాచారం.. నెల రోజుల్లో రెండో ఘటన కలకలం
July 31, 2026 03:32 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కిడ్నాప్ చేసి లైంగిక దాడి చేసినట్లు బాధితురాలి ఫిర్యాదు.. భరోసా కేంద్రానికి తరలింపు.. వరుస ఘటనలతో పోలీసుల పనితీరుపై ప్రశ్నలు.


యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎలిజాల ఉమేష్ అనే వ్యక్తి మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, తనపై బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం చింతలగడ్డ సమీపంలో బాలికను వదిలివెళ్లినట్లు సమాచారం.

స్థానికులు, బంధువులు బాలికను గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అనంతరం ఆమెను వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ కోసం భరోసా కేంద్రానికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఈ నెల 28న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉండగా, ఇదే నెల 9న అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోలేదనే ఆరోపణల మధ్య, అనంతరం అదే నిందితుడు బాధితురాలిని కిడ్నాప్ చేసిన ఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఒకే నెలలో ఇద్దరు మైనర్ బాలికలు లైంగిక దాడికి గురికావడం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. వరుసగా వెలుగుచూస్తున్న ఘటనల నేపథ్యంలో మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News