Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామ భద్రతకు సీసీ కెమెరాలే కవచం- డిఎస్పీ మధుసూదన్ రెడ్డి కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 07:51 PM

కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి

కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి

కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి
July 31, 2026 09:52 AM 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలంలో ఫామ్‌పాండ్ లక్ష్యంగా చర్యలు

రామన్నపేట, జూలై30,

ప్రస్తుత కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో 'జలసిరి' కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను ఆదేశించారు. గురువారం రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి రైతు పొలంలో ఫామ్‌పాండ్, ప్రతి గ్రామంలో ఊటకుంటల నిర్మాణాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే సాంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా సర్పంచులు, అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.


ప్రభుత్వం చేపడుతున్న జలసంరక్షణ చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు.


సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి, తహసీల్దార్ లాల్ బహదూర్ ఎంపీడీఓ రాములు ఎంపీఓ రఫీ, ఏపీఓ వెంకన్న, ఏఐఏ ఏజాజ్ అలీ ఖాన్, ఏపీఎం జానీతో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, సీసీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News