కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి
కరువుపై అప్రమత్తం.. 'జలసిరి' పనులు వేగవంతం చేయాలి. జడ్పీ సీఈఓ శోభారాణి
Editor Desk
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలంలో ఫామ్పాండ్ లక్ష్యంగా చర్యలు
రామన్నపేట, జూలై30,
ప్రస్తుత కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రతి గ్రామంలో 'జలసిరి' కార్యక్రమం కింద చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను ఆదేశించారు. గురువారం రామన్నపేట మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూగర్భ జలమట్టాన్ని పెంచే లక్ష్యంతో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి రైతు పొలంలో ఫామ్పాండ్, ప్రతి గ్రామంలో ఊటకుంటల నిర్మాణాన్ని ప్రాధాన్యతతో చేపట్టాలని సూచించారు. నీటి కొరత దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే సాంప్రదాయ పంటలకు బదులుగా తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా సర్పంచులు, అధికారులు విస్తృతంగా అవగాహన కల్పించాలని తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న జలసంరక్షణ చర్యలను గ్రామస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా కరువు ప్రభావాన్ని తగ్గించవచ్చని ఆమె పేర్కొన్నారు.
సమావేశంలో మండల ప్రత్యేక అధికారి రాఘవరెడ్డి, తహసీల్దార్ లాల్ బహదూర్ ఎంపీడీఓ రాములు ఎంపీఓ రఫీ, ఏపీఓ వెంకన్న, ఏఐఏ ఏజాజ్ అలీ ఖాన్, ఏపీఎం జానీతో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సంఘాల అధ్యక్షురాళ్లు, సీసీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి