Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కుమ్మరి సంఘం జిల్లా కో-కన్వీనర్గా రామారావు కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 31, 2026 07:19 AM

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!

ఆస్పత్రి పనుల్లో ఆలస్యం వద్దు!
July 31, 2026 05:29 AM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

రోగులకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని ఆదేశం

చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి, భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆదేశించారు. చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం రాత్రి ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి పరిసరాలతో పాటు వివిధ విభాగాల రికార్డులను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం వైద్యులు, సిబ్బంది, చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, వారికి అందుతున్న సేవలు, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన ఉచిత వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

​నూతన ఆసుపత్రి భవన నిర్మాణం చివరి దశకు చేరుకున్నందున, మిగిలి ఉన్న రోడ్ల నిర్మాణం, పరిసరాల శుభ్రత తదితర పనుల్లో ఆలస్యం తగదని కాంట్రాక్టర్‌ను హెచ్చరించారు. ప్రజావసరాల దృష్ట్యా ఆసుపత్రిని త్వరితగతిన ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్, కౌన్సిలర్లు మహమ్మద్ హన్ను, దేప రమ్య రాజు, ఉడుగు జ్యోతి రమేష్, స్థానిక నాయకులు, ఆసుపత్రి వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News