Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పార్కు స్థలాన్ని పరిరక్షించాలి.. అధికారుల నిర్లక్ష్యంపై నవీన్ రెడ్డి ఆవేదన కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 30, 2026 07:23 PM

డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది. నాలుగు ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..

డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది. నాలుగు ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..

డిజిటల్ దిశగా అంబేద్కర్ వర్సిటీ దూసుకెళ్తోంది.  నాలుగు ఆన్‌లైన్ కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..
July 30, 2026 05:05 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మరో నాలుగు కోర్సులకు త్వరలోనే అనుమతి ఆశాభావం

హైదరాబాద్, జూలై 30 : డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిజిటల్ విద్యా రంగంలో కీలక ముందడుగు వేసింది. 2026–27 విద్యా సంవత్సరానికి నాలుగు ఆన్‌లైన్ కోర్సులు నిర్వహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అనుమతి మంజూరు చేసింది. దేశంలోనే తొలి ఓపెన్ యూనివర్సిటీగా గుర్తింపు పొందిన బ్రౌ త్వరలో పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా రూపాంతరం చెందనుందని వైస్‌ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి తెలిపారు.


సెంటర్ ఫర్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ విద్యా సంవత్సరానికి ఎనిమిది కోర్సులకు దరఖాస్తు చేయగా, ఎం.ఏ. (తెలుగు), ఎం.కామ్, బి.కామ్ (ఇంగ్లీష్ మీడియం), బి.కామ్ (తెలుగు మీడియం) కోర్సులకు యూజీసీ ఆమోదం తెలిపింది. మిగిలిన నాలుగు కోర్సులకు సంబంధించి యూజీసీ సూచనలు అందాయని, వాటిని పూర్తి చేసి త్వరలోనే అనుమతులు పొందేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.


కెనడాలో అధికారిక పర్యటనలో ఉన్న వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి విశ్వవిద్యాలయ అధికారులతో మాట్లాడి సిబ్బందిని అభినందించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అన్ని విద్యా కార్యక్రమాలను క్రమంగా ఆన్‌లైన్‌లోకి తీసుకువస్తూ బ్రౌను పూర్తి స్థాయి డిజిటల్ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.


యూజీసీ నిర్ణయాన్ని రిజిస్ట్రార్ డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, డీన్లు, డైరెక్టర్లు స్వాగతించారు. నాణ్యమైన ఉన్నత విద్యను డిజిటల్ వేదికల ద్వారా మరింత అందుబాటులోకి తీసుకురావడంలో ఇది కీలక ఘట్టమని పేర్కొన్నారు. కొత్తగా ఆమోదం పొందిన కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News