ఇంటింటా 'గీతా'మృతం!
ఇంటింటా 'గీతా'మృతం!
K.RAVI
పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 1,000 కుటుంబాలకు ‘భగవద్గీత’ పుస్తకాల పంపిణీ
సంక్లిష్టంగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా విభజించి.. మహాభారతం, శ్రీమద్భాగవతం సహా 18 మహాపురాణాలను అందించి విశ్వ మానవాళికి వేగుచుక్కగా నిలిచిన వ్యాస భగవానుని జన్మదినమైన 'గురు పూర్ణిమ'ను పురస్కరించుకుని చౌటుప్పల్లో ‘ఇంటింటా శ్రీమద్భగవద్గీత’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాలకుర్ల శివయ్య గౌడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా సుమారు వెయ్యి కుటుంబాలకు భగవద్గీత పుస్తకాలను 'ప్రసాదం'గా అందించారు. ఫౌండేషన్ చైర్మన్ పాలకుర్ల మురళి గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త బడుగు శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. మానవ జీవన యానానికి భగవద్గీత ఒక దివ్యమైన దీపస్తంభం లాంటిది. సత్యాన్ని, ఆధ్యాత్మిక ధర్మాన్ని నిత్య జీవితంలో పాటించాలంటే ప్రతీ ఒక్కరూ రోజువారీగా గీతా పఠనం చేయాలి. ప్రాచీన ఋషులు రూపొందించిన ధర్మమే ఈ విశ్వానికి ఆధారపీఠంగా నిలిచింది అన్నారు. ఫౌండేషన్ చైర్మన్ మురళి గౌడ్ మాట్లాడుతూ.. సమాజంలో ఆధ్యాత్మిక చింతన, నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి