సూర్యాపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎస్ ఉడెన్ ఫర్నిచర్ షోరూమ్ను ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాణ్యమైన ఫర్నిచర్ను సరసమైన ధరలకు అందిస్తూ, మెరుగైన సేవలతో వినియోగదారుల విశ్వాసం, మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
స్థానికంగా కొత్త వ్యాపార సంస్థలు ఏర్పాటు కావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పట్టణ వ్యాపార, ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. వ్యాపారవేత్తలు నాణ్యత, సేవలకు ప్రాధాన్యం ఇస్తే ప్రజల ఆదరణ మరింత పెరుగుతుందని తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి