Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పండ్ల వ్యాపారి కుటుంబంలో వెలిగిన చదువుల దీపం.. డాక్టర్‌ కాబోతున్న ఎలియన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 02:19 PM

గుంతల్లో కూర్చొని సీపీఎం సర్పంచుల నిరసన.

గుంతల్లో కూర్చొని సీపీఎం సర్పంచుల నిరసన.

గుంతల్లో కూర్చొని సీపీఎం సర్పంచుల నిరసన.
20-09-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట–పల్లెపహాడ్‌ రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌

రామన్నపేట: రామన్నపేట–పల్లెపహాడ్‌ ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల సర్పంచులు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దుబ్బాకలో రోడ్డుపై నీటితో నిండిన గుంతల్లో కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయని, వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా మాట్లాడుతూ.. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ముందుగా గుంతలను పూడ్చి, అనంతరం పూర్తిస్థాయి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, దుబ్బాక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంతల్లో కూర్చొని సీపీఎం సర్పంచుల నిరసన.

Article Image

రామన్నపేట–పల్లెపహాడ్‌ రోడ్డుకు మరమ్మతులు చేయాలని డిమాండ్‌

రామన్నపేట: రామన్నపేట–పల్లెపహాడ్‌ ప్రధాన రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల సర్పంచులు ఆదివారం వినూత్న నిరసన చేపట్టారు. దుబ్బాకలో రోడ్డుపై నీటితో నిండిన గుంతల్లో కూర్చొని ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు.

సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా ధ్వంసమై భారీ గుంతలు ఏర్పడ్డాయని, వర్షాలకు గుంతల్లో నీరు నిలవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. విద్యార్థులు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా మాట్లాడుతూ.. సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. ముందుగా గుంతలను పూడ్చి, అనంతరం పూర్తిస్థాయి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కరించకపోతే జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి సిద్ధమవుతామని హెచ్చరించారు.

కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు, దుబ్బాక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News