Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పండ్ల వ్యాపారి కుటుంబంలో వెలిగిన చదువుల దీపం.. డాక్టర్‌ కాబోతున్న ఎలియన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 02:03 PM

రోడ్డుపక్కనే విద్యుత్ గద్దె నిర్మాణం.. ప్రమాదాలకు అవకాశం

రోడ్డుపక్కనే విద్యుత్ గద్దె నిర్మాణం.. ప్రమాదాలకు అవకాశం

రోడ్డుపక్కనే విద్యుత్ గద్దె నిర్మాణం.. ప్రమాదాలకు అవకాశం
20-09-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

తిరుమలగిరి మున్సిపల్‌ కేంద్రంలోని 11వ వార్డులో హైస్కూల్‌ ఎదురుగా అప్పారావు ఇంటి సమీపంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు నిర్మిస్తున్న గద్దెపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే, అదీ మలుపు వద్ద గద్దె నిర్మిస్తుండటంతో భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఈ మార్గం మీదుగా ప్రతిరోజూ పాఠశాల బస్సులు, ట్రాక్టర్లు, ప్రయాణికుల ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మలుపు వద్ద రోడ్డుకు అతి సమీపంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతోపాటు ప్రమాదాల ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టే ముందు సంబంధిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెను ప్రస్తుత ప్రాంతంలో కాకుండా రోడ్డుకు, మలుపుకు కొంత దూరంలో నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంటనే పనులు నిలిపివేయాలి

మున్సిపల్‌ అధికారులు, విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి ప్రస్తుత నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బంది కలగని సురక్షిత ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

Sthanikam

రోడ్డుపక్కనే విద్యుత్ గద్దె నిర్మాణం.. ప్రమాదాలకు అవకాశం

Article Image

తిరుమలగిరి మున్సిపల్‌ కేంద్రంలోని 11వ వార్డులో హైస్కూల్‌ ఎదురుగా అప్పారావు ఇంటి సమీపంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు నిర్మిస్తున్న గద్దెపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే, అదీ మలుపు వద్ద గద్దె నిర్మిస్తుండటంతో భవిష్యత్‌లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఈ మార్గం మీదుగా ప్రతిరోజూ పాఠశాల బస్సులు, ట్రాక్టర్లు, ప్రయాణికుల ఆటోలు, ఇతర వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. మలుపు వద్ద రోడ్డుకు అతి సమీపంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేస్తే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడటంతోపాటు ప్రమాదాల ముప్పు ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా అభివృద్ధి పనులు చేపట్టే ముందు సంబంధిత ప్రాంత ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వారు కోరుతున్నారు. విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దెను ప్రస్తుత ప్రాంతంలో కాకుండా రోడ్డుకు, మలుపుకు కొంత దూరంలో నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

వెంటనే పనులు నిలిపివేయాలి

మున్సిపల్‌ అధికారులు, విద్యుత్‌ శాఖ అధికారులు స్పందించి ప్రస్తుత నిర్మాణ పనులను వెంటనే నిలిపివేసి, ప్రజలకు మరియు వాహనదారులకు ఇబ్బంది కలగని సురక్షిత ప్రాంతాన్ని ఎంపిక చేసి అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే అధికారులు స్పందించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News