Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పండ్ల వ్యాపారి కుటుంబంలో వెలిగిన చదువుల దీపం.. డాక్టర్‌ కాబోతున్న ఎలియన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 02:02 PM

గొడ్డలితో కూతురిపై తండ్రి దాడి

గొడ్డలితో కూతురిపై తండ్రి దాడి

గొడ్డలితో కూతురిపై తండ్రి దాడి
20-09-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఇంటి వివాదమే కారణం.. చేతికి తీవ్ర గాయం.


ఇంటి విషయంలో నెలకొన్న వివాదం ఓ తండ్రి దాడికి దారితీసింది. కూతురిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నకిరేకల్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన రాగం స్వప్న (29) టైలరింగ్‌ వృత్తి చేస్తూ జీవిస్తోంది. కుటుంబ విభేదాల కారణంగా కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ మూసీ రోడ్డులో అద్దె గదిలో నివసిస్తోంది. డాక్టర్స్‌ కాలనీలో టైలరింగ్‌ షాపు నిర్వహిస్తోంది.

స్వప్న తండ్రి అయినాల లింగయ్య తన కుమార్తెకు శివాజీనగర్‌లో ఇంటిని కట్నంగా ఇచ్చి ఆమె పేరుపై పట్టా చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఇంటిని తిరిగి తమకు ఇవ్వాలని కొంతకాలంగా తండ్రి ఒత్తిడి చేస్తూ, బెదిరిస్తున్నాడని స్వప్న ఆరోపించింది.ఈ క్రమంలో 18వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటలకు స్వప్న టైలరింగ్‌ షాపులో పనిచేస్తుండగా లింగయ్య గొడ్డలితో అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ దాడిలో స్వప్న కుడి తొడకు గాయమైంది. తలపై గొడ్డలితో దాడి చేయబోగా ఆమె ఎడమ చేతిని అడ్డుపెట్టడంతో మణికట్టు పైభాగంలో తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన స్వప్నను తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నకిరేకల్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల తుది నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Sthanikam

గొడ్డలితో కూతురిపై తండ్రి దాడి

Article Image

ఇంటి వివాదమే కారణం.. చేతికి తీవ్ర గాయం.


ఇంటి విషయంలో నెలకొన్న వివాదం ఓ తండ్రి దాడికి దారితీసింది. కూతురిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నకిరేకల్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన రాగం స్వప్న (29) టైలరింగ్‌ వృత్తి చేస్తూ జీవిస్తోంది. కుటుంబ విభేదాల కారణంగా కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ మూసీ రోడ్డులో అద్దె గదిలో నివసిస్తోంది. డాక్టర్స్‌ కాలనీలో టైలరింగ్‌ షాపు నిర్వహిస్తోంది.

స్వప్న తండ్రి అయినాల లింగయ్య తన కుమార్తెకు శివాజీనగర్‌లో ఇంటిని కట్నంగా ఇచ్చి ఆమె పేరుపై పట్టా చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఇంటిని తిరిగి తమకు ఇవ్వాలని కొంతకాలంగా తండ్రి ఒత్తిడి చేస్తూ, బెదిరిస్తున్నాడని స్వప్న ఆరోపించింది.ఈ క్రమంలో 18వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటలకు స్వప్న టైలరింగ్‌ షాపులో పనిచేస్తుండగా లింగయ్య గొడ్డలితో అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ దాడిలో స్వప్న కుడి తొడకు గాయమైంది. తలపై గొడ్డలితో దాడి చేయబోగా ఆమె ఎడమ చేతిని అడ్డుపెట్టడంతో మణికట్టు పైభాగంలో తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు.

గాయపడిన స్వప్నను తొలుత ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నకిరేకల్‌ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల తుది నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News