Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 08:23 PM

భువనగిరిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు. BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 76 మంది రక్తదానం.

భువనగిరిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు. BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 76 మంది రక్తదానం.

భువనగిరిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు. BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 76 మంది రక్తదానం.
20-09-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని BJYM భువనగిరి పట్టణం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని SSR కాలేజీ, బస్‌స్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి BJYM పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్ నేతృత్వం వహించారు. శిబిరంలో 76 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

మామిడోజు పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా BJYM కొనసాగిస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, BJYM నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో ఘనంగా మోదీ జన్మదిన వేడుకలు. BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం.. 76 మంది రక్తదానం.

Article Image

భువనగిరి: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని BJYM భువనగిరి పట్టణం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పట్టణంలోని SSR కాలేజీ, బస్‌స్టాండ్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి BJYM పట్టణ అధ్యక్షుడు మామిడోజు పవన్ కుమార్ నేతృత్వం వహించారు. శిబిరంలో 76 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.

మామిడోజు పవన్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రాజకీయ కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఉపయోగపడే సామాజిక సేవా కార్యక్రమాలను కూడా BJYM కొనసాగిస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కౌన్సిలర్లు, BJYM నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News