Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్! అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 20, 2026 07:29 PM

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
20-09-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో సాయిపేట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆదివారం నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ యువజన అధ్యక్షుడు కొర్పోల్ విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కొర్పోల్ విష్ణు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద ప్రజల సంక్షేమమే లక్ష్యం.. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ

Article Image

ఆందోల్ నియోజకవర్గంలో సాయిపేట గ్రామంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఆదివారం నూతన డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ యువజన అధ్యక్షుడు కొర్పోల్ విష్ణు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని అర్హులైన పేద కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా కొర్పోల్ విష్ణు మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. నూతన స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు సరుకులు సక్రమంగా అందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గ్రామంలో అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా స్థానిక నాయకులు, కార్యకర్తలు, యువత సమన్వయంతో కృషి చేస్తామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News