PRINT TIME: July 22, 2026 06:37 PM
రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్పీవో సుధాకర్ రెడ్డి
రోడ్లపై చెత్తకు నో.. వ్యాపార సంస్థల్లో చెత్త బుట్టలు తప్పనిసరి: డీఎల్పీవో సుధాకర్ రెడ్డి
July 22, 2026 04:53 PM
118 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి గ్రామపంచాయతీలో డీఎల్పీవో సుధాకర్ రెడ్డి, ఎంపీవో లక్ష్మయ్య, పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్, సర్పంచ్ కృష్ణ ముదిరాజ్ కలిసి హోటళ్లు, కిరాణా, కూరగాయలు, పండ్ల దుకాణాలు, బేకరీలను తనిఖీ చేశారు. ప్రతి వ్యాపార సంస్థ తప్పనిసరిగా చెత్త బుట్టలను ఏర్పాటు చేసుకొని, చెత్తను రోడ్లపై వేయకుండా పరిశుభ్రత పాటించాలని సూచించారు. తనిఖీల్లో ఓ హోటల్ ముందు చెత్త కనిపించడంతో రూ.500 జరిమానా విధించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వ్యాపారులు, ప్రజలు అందరూ సహకరించాలని అధికారులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి