Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ మున్సిపాలిటీలో ‘చేయూత’ పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 05:27 AM

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్
30-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

మృతుడి తల్లి అనారోగ్యంపై వెంటనే స్పందన.. సొంత వాహనంలో నల్గొండకు తరలింపు.


చిట్యాల: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్. తాజాగా తన కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఓ కుటుంబానికి ఆమె అండగా నిలిచారు.రెండో వార్డుకు చెందిన గూడపూరి రాణి, గూడపూరి మహేందర్ దంపతుల కుమారుడు ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుమారుడి మృతిని జీర్ణించుకోలేక తల్లి గూడపూరి రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

విషయం తెలుసుకున్న కౌన్సిలర్ షబానా అజీమ్ వెంటనే స్పందించి రాణిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించాలని సూచించారు.దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన షబానా అజీమ్ తన సొంత వాహనంలోనే రాణిని నల్గొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాణికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.మానవత్వమే నిజమైన ప్రజాసేవ ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ షబానా అజీమ్ చూపుతున్న సేవాభావంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు, అనారోగ్యంతో ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రికి తరలించడం ఆమె మానవతా దృక్పథానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.

Sthanikam

ఆపదలో ఆపన్నహస్తం.. షబానా అజీమ్

Article Image

మృతుడి తల్లి అనారోగ్యంపై వెంటనే స్పందన.. సొంత వాహనంలో నల్గొండకు తరలింపు.


చిట్యాల: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్. తాజాగా తన కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఓ కుటుంబానికి ఆమె అండగా నిలిచారు.రెండో వార్డుకు చెందిన గూడపూరి రాణి, గూడపూరి మహేందర్ దంపతుల కుమారుడు ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుమారుడి మృతిని జీర్ణించుకోలేక తల్లి గూడపూరి రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

విషయం తెలుసుకున్న కౌన్సిలర్ షబానా అజీమ్ వెంటనే స్పందించి రాణిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించాలని సూచించారు.దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన షబానా అజీమ్ తన సొంత వాహనంలోనే రాణిని నల్గొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాణికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.మానవత్వమే నిజమైన ప్రజాసేవ ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ షబానా అజీమ్ చూపుతున్న సేవాభావంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు, అనారోగ్యంతో ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రికి తరలించడం ఆమె మానవతా దృక్పథానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News