మృతుడి తల్లి అనారోగ్యంపై వెంటనే స్పందన.. సొంత వాహనంలో నల్గొండకు తరలింపు.
చిట్యాల: కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు చిట్యాల మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్. తాజాగా తన కుమారుడి మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఓ కుటుంబానికి ఆమె అండగా నిలిచారు.రెండో వార్డుకు చెందిన గూడపూరి రాణి, గూడపూరి మహేందర్ దంపతుల కుమారుడు ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. కుమారుడి మృతిని జీర్ణించుకోలేక తల్లి గూడపూరి రాణి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
విషయం తెలుసుకున్న కౌన్సిలర్ షబానా అజీమ్ వెంటనే స్పందించి రాణిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమె ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మెరుగైన వైద్యం కోసం నల్గొండకు తరలించాలని సూచించారు.దీంతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన షబానా అజీమ్ తన సొంత వాహనంలోనే రాణిని నల్గొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రాణికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.మానవత్వమే నిజమైన ప్రజాసేవ ప్రజా ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించడమే కాకుండా, ఆపదలో ఉన్న కుటుంబాలకు తన వంతు సహాయం అందిస్తూ షబానా అజీమ్ చూపుతున్న సేవాభావంపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు, అనారోగ్యంతో ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రికి తరలించడం ఆమె మానవతా దృక్పథానికి నిదర్శనమని స్థానికులు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి