ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పెన్పహాడ్ మండలంలోని దూపహాడ్ గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన మాజీ జడ్పీటీసీ పిన్నాని కోటేశ్వరరావు కుమారుడిని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శనివారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. గాయపడిన యువకుడికి మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో దూపహాడ్ గ్రామ సర్పంచ్ నున్నపంగా కమలమ్మ సైదులు, ఉప సర్పంచ్ ఆర్తి నరేష్, కాంగ్రెస్ నాయకులు బిట్టు వీరయ్య, పబ్బతి కోటేశ్వరరావు, జనార్దన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, పెన్పహాడ్ మండల ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు పిన్నాని సందీప్, జిల్లా కాంగ్రెస్ నాయకులు నకేరేకంటి వెంకన్న (కేకే), వెన్న ఉపేందర్, షేక్ రహీం, నర్సింగ్ కిరణ్, భూక్య మహేష్, పిల్లల నాగరాజు, బూర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి