ఆత్మహత్యా..? హత్యా..? మిస్టరీగా మారిన ఘటన..
మృతదేహం వద్ద ఇంజెక్షన్ నీడల్, కాలిపోయిన దుస్తులు.
కొండమల్లెపల్లి: నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలంలోని ఓ క్రషర్ మిల్ సమీప గుట్టలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. మృతదేహం పాక్షికంగా కాలిపోయి ఉండటంతో ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్రషర్ మిల్ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఇంజెక్షన్ నీడల్, కాలిపోయిన దుస్తులు లభించినట్లు సమాచారం.
వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడా..? లేక ఎవరైనా హత్య చేసి ఆధారాలు లేకుండా చేసేందుకు నిప్పంటించారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి