Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇనుగుర్తి లో ఘనంగా రాఖీ పండుగ వేడుకలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 08:32 PM

గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.

గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.

గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.
28-08-2026 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 28: రహదారిపై ఏర్పడిన గుంతలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఆటో యూనియన్‌ సభ్యులు అండగా నిలిచారు. రామన్నపేట మండల కేంద్రం నుంచి అమ్మనబోలు వెళ్లే రహదారిపై గుంతలను శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రమదానం చేసి పూడ్చారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యూనియన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుంతల్లో మట్టి పోసి తాత్కాలికంగా పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య, మేకల రాములు, కప్పుల రమేష్‌, గంటెపాక బిక్షం, లక్ష్మయ్యచారి, ఎండీ మజ్జు, బొంగు బిక్షం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గుంతలు పూడ్చిన ఆటో యూనియన్‌ సభ్యులు.

Article Image

రామన్నపేట, ఆగస్టు 28: రహదారిపై ఏర్పడిన గుంతలతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు ఆటో యూనియన్‌ సభ్యులు అండగా నిలిచారు. రామన్నపేట మండల కేంద్రం నుంచి అమ్మనబోలు వెళ్లే రహదారిపై గుంతలను శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం శ్రమదానం చేసి పూడ్చారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని యూనియన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గుంతల్లో మట్టి పోసి తాత్కాలికంగా పూడ్చి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.

అధికారులు స్పందించి రహదారికి శాశ్వత మరమ్మతులు చేపట్టి ప్రయాణికుల కష్టాలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షుడు తుర్కపల్లి ఉప్పలయ్య, మేకల రాములు, కప్పుల రమేష్‌, గంటెపాక బిక్షం, లక్ష్మయ్యచారి, ఎండీ మజ్జు, బొంగు బిక్షం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News