మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు నీలం మధుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చూపిన ఆప్యాయతకు నీలం మధు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మిఠాయిలు అందించి సోదరభావంతో పలకరించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, ఆప్యాయతను చాటే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, స్వేచ్ఛగా, భద్రంగా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.రక్షాబంధన్ వంటి పండుగలు కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు అన్నారు. మహిళల పట్ల గౌరవం, భద్రతతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు
రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు
Krishna
మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు నీలం మధుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చూపిన ఆప్యాయతకు నీలం మధు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మిఠాయిలు అందించి సోదరభావంతో పలకరించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, ఆప్యాయతను చాటే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, స్వేచ్ఛగా, భద్రంగా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.రక్షాబంధన్ వంటి పండుగలు కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు అన్నారు. మహిళల పట్ల గౌరవం, భద్రతతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి