Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:11 PM

రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు

రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు

రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు
28-08-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు నీలం మధుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చూపిన ఆప్యాయతకు నీలం మధు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మిఠాయిలు అందించి సోదరభావంతో పలకరించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, ఆప్యాయతను చాటే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, స్వేచ్ఛగా, భద్రంగా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.రక్షాబంధన్ వంటి పండుగలు కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు అన్నారు. మహిళల పట్ల గౌరవం, భద్రతతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Sthanikam

రాఖీ కట్టి సోదరభావాన్ని చాటిన మహిళలు.. నీలం మధు ఆప్యాయ పలకరింపు

Article Image

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ నివాసంలో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఆత్మీయంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మహిళలు, సోదరీమణులు నీలం మధుకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు చూపిన ఆప్యాయతకు నీలం మధు కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి మిఠాయిలు అందించి సోదరభావంతో పలకరించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, ఆప్యాయత, నమ్మకం, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. రాఖీ కట్టడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదని, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకాన్ని, ఆప్యాయతను చాటే పవిత్రమైన బంధమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి మహిళ గౌరవంగా, స్వేచ్ఛగా, భద్రంగా జీవించే వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మహిళల అభ్యున్నతి, సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.రక్షాబంధన్ వంటి పండుగలు కుటుంబ సభ్యుల మధ్యనే కాకుండా సమాజంలోని ప్రతి ఒక్కరి మధ్య సోదరభావం, ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని నీలం మధు అన్నారు. మహిళల పట్ల గౌరవం, భద్రతతో కూడిన సమాజ నిర్మాణానికి అందరూ కలిసి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News