ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
సూర్యాపేట పట్టణంలోని డీమార్ట్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ యూఐడీఏఐ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథ్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సూర్యాపేట పట్టణంలో ఆధార్ నమోదు, ఆధార్లో సవరణలు చేసుకునేందుకు సేవా కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. ఆధార్కు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం ప్రజలు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సూర్యాపేటలోనే సేవలు పొందవచ్చని తెలిపారు. ఈ కేంద్రంలో కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడంతో పాటు ఆధార్లో అవసరమైన సవరణలు కూడా చేసుకునే అవకాశం ఉందన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో యూఐడీఏఐ రీజినల్ మేనేజర్ శ్రీనివాసు, ఏడీఎం ఆపరేషన్స్ లాలు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి