Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:26 PM

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
28-08-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జుక్కల్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని సూచించారు.అలాగే పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Sthanikam

విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

Article Image

జుక్కల్ నియోజకవర్గంలో విద్య, వైద్య రంగాలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అన్నారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, వైద్యాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు నాణ్యమైన విద్య, పదో తరగతి ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని సూచించారు.అలాగే పీహెచ్‌సీల్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు. గర్భిణీలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పేదలకు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం అందించడమే ప్రజాప్రతినిధుల ప్రథమ కర్తవ్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News