సదాశివపేటలోని శ్రీమతి జానకమ్మ రఘునాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న పురాతన గుండం బావి పుష్కరిణి తీర్థ స్నాన కార్యక్రమం ఈనెల 30న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కరణం నరసింహారావు తెలిపారు. బ్రహ్మశ్రీ బాల మార్తాండ సర్వతోముఖ యాజి ఆధ్వర్యంలో శ్రావణ బహుళ విదియ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఉదయం 10 గంటలకు పుష్కరిణి తీర్థ స్నానం, 11 గంటలకు లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణ సమారాధనతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం సంగీత విభావరి, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పుష్కరిణి తీర్థ స్నానం సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైనదని, పురాతన కాలం నుంచి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి తీర్థ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కరణం నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల బ్రాహ్మణులు, భక్తులు, భజన బృందాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట
Krishna
సదాశివపేటలోని శ్రీమతి జానకమ్మ రఘునాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న పురాతన గుండం బావి పుష్కరిణి తీర్థ స్నాన కార్యక్రమం ఈనెల 30న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కరణం నరసింహారావు తెలిపారు. బ్రహ్మశ్రీ బాల మార్తాండ సర్వతోముఖ యాజి ఆధ్వర్యంలో శ్రావణ బహుళ విదియ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఉదయం 10 గంటలకు పుష్కరిణి తీర్థ స్నానం, 11 గంటలకు లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణ సమారాధనతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం సంగీత విభావరి, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పుష్కరిణి తీర్థ స్నానం సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైనదని, పురాతన కాలం నుంచి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి తీర్థ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కరణం నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల బ్రాహ్మణులు, భక్తులు, భజన బృందాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి