Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:13 PM

గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట

గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట

గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట
28-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేటలోని శ్రీమతి జానకమ్మ రఘునాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న పురాతన గుండం బావి పుష్కరిణి తీర్థ స్నాన కార్యక్రమం ఈనెల 30న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కరణం నరసింహారావు తెలిపారు. బ్రహ్మశ్రీ బాల మార్తాండ సర్వతోముఖ యాజి ఆధ్వర్యంలో శ్రావణ బహుళ విదియ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఉదయం 10 గంటలకు పుష్కరిణి తీర్థ స్నానం, 11 గంటలకు లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణ సమారాధనతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం సంగీత విభావరి, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పుష్కరిణి తీర్థ స్నానం సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైనదని, పురాతన కాలం నుంచి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి తీర్థ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కరణం నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల బ్రాహ్మణులు, భక్తులు, భజన బృందాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Sthanikam

గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట

Article Image

సదాశివపేటలోని శ్రీమతి జానకమ్మ రఘునాథ స్వామి దేవాలయం వద్ద ఉన్న పురాతన గుండం బావి పుష్కరిణి తీర్థ స్నాన కార్యక్రమం ఈనెల 30న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త కరణం నరసింహారావు తెలిపారు. బ్రహ్మశ్రీ బాల మార్తాండ సర్వతోముఖ యాజి ఆధ్వర్యంలో శ్రావణ బహుళ విదియ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.ఉదయం 10 గంటలకు పుష్కరిణి తీర్థ స్నానం, 11 గంటలకు లఘున్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బ్రాహ్మణ సమారాధనతో పాటు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం సంగీత విభావరి, భజన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.పుష్కరిణి తీర్థ స్నానం సనాతన ధర్మంలో ఎంతో పవిత్రమైనదని, పురాతన కాలం నుంచి పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి తీర్థ స్నానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని కరణం నరసింహారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సదాశివపేటతో పాటు చుట్టుపక్కల గ్రామాల బ్రాహ్మణులు, భక్తులు, భజన బృందాలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News