అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ: ఇంద్రసేనారెడ్డి
రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మునుగోడు నియోజకవర్గంలో సోదరభావాన్ని చాటే వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, చౌటుప్పల్-నారాయణపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేనారెడ్డి దంపతుల నివాసంలో ఈ వేడుకలను అభిమాన వాతావరణంలో నిర్వహించారు.కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ప్రతినిధి పెద్దగొని మౌనిక... ఇంద్రసేనారెడ్డి దంపతులకు రాఖీ కట్టి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి మిఠాయిలు తినిపించి, వారు ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి దంపతులు మాట్లాడుతూ.. "రాఖీ పండుగ అనేది అన్నాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీక. మా చెల్లెలు మౌనిక స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది" అని పేర్కొన్నారు. మౌనిక మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, మద్దతు తమకు ఎల్లప్పుడూ ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి