మున్సిపల్ కౌన్సిల్
సమావేశంలో రూ. 53.52 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
నూతన భవన నిర్మాణానికి రూ. 9.65 కోట్లు కేటాయింపు
ఎజెండా చర్చల వేళ ప్రతిపక్ష కౌన్సిలర్ల వాకౌట్
చౌటుప్పల్ పురపాలక సంఘ పరిధిలోని 20 వార్డుల సమగ్ర అభివృద్ధి, పారిశుధ్యం, మౌలిక వసతుల కల్పన కోసం మొత్తం రూ. 53.52 కోట్ల (రూ. 53,52,23,300/-) అంచనా వ్యయ ప్రతిపాదనలకు కౌన్సిల్ పరిపాలనా ఆమోదం తెలిపింది. చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సాధారణ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సమావేశంలో అధికారుల నివేదికల అనంతరం ఎజెండా అంశాలపై చర్చ జరుగుతుండగా ప్రతిపక్ష కౌన్సిలర్లు వాకౌట్ చేశారు. ఆ తర్వాత కొనసాగిన సమావేశంలో, వార్డు బౌండరీల లోపలే ఎలక్షన్ ఓటర్ల జాబితా (సర్) ప్రక్రియను చేపట్టాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
రూ. 53.52 కోట్ల బడ్జెట్ కేటాయింపుల వివరాలు
యుసిఎఫ్ బృహత్ ప్రాజెక్టులు రూ. 38.00 కోట్లు (మల్టీఫంక్షన్ హాల్, గాంధీ పార్క్ టౌన్ హాల్, షాపింగ్ కాంప్లెక్స్), నూతన మున్సిపల్ భవనం రూ. 9.65 కోట్లు, ఘన వ్యర్థాల నిర్వహణ రూ. 2.64 కోట్లు (డి ఆర్ సీసీ, స్మశాన వాటిక), అత్యవసర వార్డు పనులు రూ. 1.90 కోట్లు (34 రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం), వీధి దీపాల నిర్వహణ రూ. 50.00 లక్షలు, పారిశుధ్యం, సేఫ్టీ గేర్ రూ. 44.00 లక్షలు,
వేసవి తాగునీటి ప్రణాళిక రూ. 36.00 లక్షలు, వేతనాలు, శిక్షణ రూ. 3.23 లక్షలు,పట్టణాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా మార్చడమే లక్ష్యంగా, నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ ఈ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తామని చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్ వెల్లడించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి