Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పదవి బాధ్యతలు చేపట్టిన అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ డాకూర్ అశోక్ గౌడ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:28 PM

ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య

ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య

ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య
27-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పని దొరక్క ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ వెల్డింగ్ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ పురపాలక వర్గం పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు (32) బతుకుతెరువు కోసం రెండేళ్ల క్రితం చౌటుప్పల్‌కు వచ్చి వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

​గత నాలుగు రోజులుగా పని దొరకకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 26) రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తమ్ముడు అంబటి జోగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

Sthanikam

ఉపాధి లభించక వెల్డింగ్ కార్మికుడు ఆత్మహత్య

Article Image

పని దొరక్క ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురై ఓ వెల్డింగ్ కార్మికుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చౌటుప్పల్ పురపాలక వర్గం పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్ర గ్రామానికి చెందిన అంబటి జానకిరావు (32) బతుకుతెరువు కోసం రెండేళ్ల క్రితం చౌటుప్పల్‌కు వచ్చి వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

​గత నాలుగు రోజులుగా పని దొరకకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం (ఆగస్టు 26) రాత్రి 11:30 గంటల సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తమ్ముడు అంబటి జోగారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News